కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించు కోవడాని కి ఎటువంటి ఆహార పదార్దాలు వాడాలి అనేది తెలుకొని ఈ మహమ్మారి నుండి మనల్ని మనమే రక్షించు కుందాం
చైనాలో వుహాన్ నుంచి ప్రారంభం అయి ఈ కరోనా వ్యాధి ప్రపంచమంతా వ్యాపించి పోయింది ఎక్కడ చూసిన ఈ వ్యాధి భారిన పడిన వారు సంఖ్య రోజు రోజు కీ పెరిగి పోతూనే ఉంది. ఈవ్యాధి బారి న పడి మరణించిన వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ వ్యాధి వ్యాప్తి మాత్రం చాల ఎక్కువ గానే ఉంది, తాత్కాలికమైన కొన్ని మందుల తో చాల మందికి ఉపశమనము కలుగుతున్నప్పటికీ మన శరీరం లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడ మొక్కటే మరణం నుంచి తప్పించుకొనే ఏకైక మార్గమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధికి వాక్సిన్ కనుకున్నామని చెబుతున్నప్పటికీ పూర్తీగా వాడుకలోకి రావడానికి ఇంకా కనీసం 6 నెలల వరకు పట్టవచ్చని డాక్టర్లు కెమిస్టులు చెబుతున్నారు.
అయితే మన శరీరం లో ఎటువంటి పోషక పదార్దాల వల్ల ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అవి ఏ ఏ ఆహార పదార్దాలలో ఉన్నాయో మనం తెలుసుకుందాం
- అల్లం : అల్లం లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది . అర అంగుళం అల్లం ముక్క ప్రతి రోజు పచ్చిగాగని ఆహార పదార్దాలతో గాని కలిపి తీసుకొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం కాల్చు కొని దానితో తేనె గాని ఉప్పు గాని అద్దుకొని తిన వచ్చు. దీని వల్ల రొంప దగ్గు జ్వరం రాకుండా ఉండడమే కాకుండా వైరస్ రాకుండా కాపాడుతుంది.
- బచ్చలి కూర : బచ్చలి కూరలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ గా ఉంటుంది. విటమిన్ సి' దీనిలో ఉండే అంటి ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ లు ఎలాంటి వ్యాదులు రాకుండా మనల్ని కాపాడుతుంది
- పాల కూర : బచ్చలి కూరలాగే పాలకూర కూడా చాల అంటి ఆక్సిడెంట్లు విటమిన్' సి' విటమిన్ 'కె' , బీటా కెరోటిన్ ను కలిగి వుంది.
- బ్రౌన్ రైస్ : బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం ) ఒక్కప్పుడు అందరు దంపుడు బియ్యమే గ్రామాలలో వాడే వారు అయితే బియ్యం మిల్లులు ఎపుడైతే వచ్చాయో దంపుడు బియ్యం వినియోగం తగ్గి పోయింది దీని లో కూడా పోషక విలువలు బాగానే ఉన్నాయి . అంటి ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ గా ఉన్నాయి.
- క్యారట్ : బీటా కెరోటిని విటమిని బి 6 ఎక్కువ ఉండడం వాళ్ళ కంటి కి ఒంటికి కూడా చాల ఆరోగ్యప్రదం. ప్రతి రోజు అరా కప్పు కారట్ జ్యూస్ లేదా ఆహార పదార్దాలో వాడడం లేదా ఫ్రూట్ సలాడ్ గా గాని వాడితే చాల మంచిది.
- గుమ్మిడి కాయ గింజలు: బీటా కెరోటిన్ ఎక్కువ ఉండడం వాళ్ళ ఇమ్మ్యూనిటి బాగా పెరుగుతుంది .
- అవిసె గింజలు : ఆల్ఫా లీనో లెనిక్ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఎక్కువగా ఉండడం వాళ్ళ , ఇమ్మ్యూనిటి బాగా పెరుగుతుంది.
- దాల్చిన చెక్క : దాల్చిన చెక్క పాలీ పీనల్ స్ అనే అంటి ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి .
- వెల్లుల్లి : రోజు ఒకటి రెండు పచ్చి వెల్లులి రెబ్బలు తింటే మన శరీరం అంటి బాడీస్ పెరిగి ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. వెల్లుల్లి లో అంటి ఫంగస్, వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. కూరలలో అయితే మాములుగా కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి .
- నీళ్లు :రోజు పరిశుద్ధమైన తగినంత నీరు కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడి వైరస్ మన దరి చేరాడు
- లవంగాలు : విటమిన్ 'సి' ఫైబర్, మాంగనీస్, విటమిన్ 'కె ' ఉండడం వల్ల మన రోగ నిరోధకత బాగా పెరుగుతుంది.
- మిరియాలు : మిరియాల లో అంటి బాక్ట్రయల్ అంటి వైరల్ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మిర్యాలు తాలింపులలో మాములు 4-5 గింజలు వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జ్వరం, దగ్గు, కఫం ఉన్నప్పుడు మిరియాల కషాయం 1 కప్పు వాడడం మనకి ఎపుడో తెలుసు.
- జీలకర్ర : జీలకర్ర లో పాలిపేరాన్ అనే పదార్థం మనలో ఇమ్మ్యూనిటీని పెంచుతుంది . మాములు కంటే కొద్దిగా పోపులో ఎక్కువ వాడితే మంచిది. మన శరీరం లో ఉబకాయాన్ని తగ్గించు కోవడానికి జీల కర్ర పొడి రోజు 1నించి 2 స్పూన్ లు వాడుతుంటారు.
- పసుపు :పసుపు ఒక సాధారణ మసాలా. పసుపుని మనం వంటకాలకే కాక , దెబ్బలకు కు కూడా పూస్తాము . మనకి పసుపు ఏంతో మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్ మరియు యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని చెపుతారు. మరియు ఇది వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను కల్పించడం లో సహాయపడుతుంది.